కుటుంబసభ్యుల ఎదుటే బాలికపై అత్యాచారం, ఎందుకంటే?
ఓ యువతిపై అత్యాచారం చేసినందుకు ప్రతీకారంగా నిందితుడి సోదరిపై కుటుంబసభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేయాలని గ్రామపంచాయితీ పెద్దలు ఆదేశించారు. ఈ ఆదేశాలను ఆ యువకుడు పాటించాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్లోని పంజ
పంజాబ్: ఓ యువతిపై అత్యాచారం చేసినందుకు ప్రతీకారంగా నిందితుడి సోదరిపై కుటుంబసభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేయాలని గ్రామపంచాయితీ పెద్దలు ఆదేశించారు. ఈ ఆదేశాలను ఆ యువకుడు పాటించాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన చెందిన ఓ గ్రామపంచాయితీ పెద్దలు దారుణమైన తీర్మాణం చేశారు.. ఈ తీర్మాణం ప్రకారంగా కుటుంబసభ్యుల ఎదుటే 16 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేయాలని తీర్మాణం చేశారు. అయితే ఆ బాలిక చేసిన తప్పేమీలేదు.
బాలిక సోదరుడు మరో యువకుడి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామపెద్దలు ఈ తీర్మాణం చేశారు. ముజప్పరాబాద్లోని రాజ్పుర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ ఘటనకు కారణమైన 20 మందిని అరెస్టుచేశారు.
ఈ ఆదేశాలను జారీచేసిన పంచాయితీ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి సోదరుడు తన సోదరిని అత్యాచారం చేశాడని ముహల్లేకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదుచేశాడు. ఈ వ్యవహరం గ్రామపంచాయతీకి చేరింది.
దీంతో
పంచాయితీ
అధ్యక్షుడు
అత్యాచార
బాధితురాలి
సోదరుడు
ఈ
ఘటనకు
పాల్పడిన
నిందితుడి
సోదరిని
రేప్
చేయాలని
ఆదేశించారు.
ఈ
తీర్మాణాన్ని
బాధితురాలి
కుటుంబసభ్యులు
తీవ్రంగా
వ్యతిరేకించారు.
ఈ
ఉదంతంలో
ఇదే
సరైన
శిక్షని
పేర్కొన్న
పంచాయితీ
దాన్ని
అమలయ్యేలా
చూసింది.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.