రెండ్రోజుల్లో మరొకటి, నేపాల్లో కూలిన ఇంకో విమానం
ఖాట్మాండ్: నేపాల్లో మరో విమాన ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితమే ఓ విమానం నేపాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. తాజాగా మరో విమాన ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఓ విమానం పర్వతాల్లో కూలింది.
నేపాల్ గంజ్ నుంచి జుమ్లాకు వెళుతున్న ఎయిర్ కాస్టామండప్కు చెందిన 9ఎన్-ఏజేబీ విమానం కూలిపోయింది. కలికోట్ జిల్లాలోని చిల్ ఖాయా సమీపంలో విమానం కుప్పకూలింది. విమానం కూలిన సమయంలో అందులో 11 మంది ప్రయాణిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ అధికార ప్రతినిధి పదంలాల్ మాట్లాడుతూ.. ఒకరు చనిపోయి ఉంటారని చెప్పారు. మరోవైపు, స్థానిక మీడియా మాత్రం.. ఇద్దరు పైలట్లు చనిపోయినట్లుగా తెలుస్తోందని పేర్కొంటున్నాయి.
#Update Air Kasthamandap crash-land in Kalikot, two feared deadhttps://t.co/MNDYPlMYeX pic.twitter.com/umcZec4UHD
— The Kathmandu Post (@kathmandupost) February 26, 2016