వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం కూలి బిన్ లాడ్ బంధువుల మృతి

|
Google Oneindia TeluguNews

లండన్: విమానం కుప్పకూలిపోవడంతో నలుగురు సజీవదహనం అయిన సంఘటన సౌత్ ఇంగ్లాండ్ లో జరిగింది. మరణించిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు పైలెట్ ఉన్నారని బ్రిటీష్, సౌదీ మీడియా వెల్లడించింది. అయితే మృతి చెందిన వారి పూర్తి వివరాలు బయటకు రావలసి ఉంది.

సౌదీకి చెందిన ఓ ప్రయివేటు విమానం శుక్రవారం కూలిపోయిందని బ్రిటన్ లోని హాంప్ పైర్ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. విమానం ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయిందని అధికారులు తెలిపారు. లాడెన్ సవతి తల్లి, చెల్లి, మరొకరు అందులో ఉన్నారని సమాచారం.

ఈ ప్రమాదంలో ఎవ్వరూ బ్రతికే అవకాశం లేదని, ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నామని హాంప్ పైర్ పోలీసు అధికారులు చెప్పారు. ఇటలీలోని మిలాన్ కు చెందిన ఈ విమానం సౌదీలో రిజిస్టర్ అయ్యిందని, అది వారి సొంత విమానం అని ఎయిర్ పోర్టు అధికారులు అన్నారు.

అమెరికా సైన్యం మట్టుబెట్టిన తీవ్రవాది, ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ కు సమీప బంధువులు ముగ్గురు ఈ విమానంలో ప్రయాణించారని బ్రిటీష్, సౌదీ మీడియా వెల్లడించింది. బ్రిటీష్ రాయబారి కార్యాలయం అధికారి ఒకరు ఈ విషయంపై ట్విట్ చేశారు. దురదృష్టవశాత్తు విమానం కుప్పకూలిపోవడంతో పైలెట్ తో పాటు నలుగురు మరణించారని ఆ అధికారి ట్విట్ చేశారు.

English summary
The jet was completely destroyed after it overshot the runway while trying to land at the Blackbushe Airport on the Hampshire-Surrey border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X