మనిషిని చంపిన రోబో: దోషిగా తేలితే ఏ శిక్ష?
రోబో మనిషిని చంపిన దుర్ఘటన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. జర్మనీ ఆటో దిగ్గజం వోక్స్వాగన్ తయారీ ప్లాంట్లో ఓ కాంట్రాక్టర్ను రోబో చంపినట్టు కంపెనీ అధికారులు బుధవారం వెల్లడించారు.
ఫ్రాంక్ఫర్ట్కు వంద కిలోమీటర్ల దూరంలో గల వోక్స్వాగన్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ (22) రోబోకు కొన్ని పరికరాలు అమర్చుతున్నాడు. ఆ సమయంలో రోబోని ఆపరేట్ చేసే వ్యక్తి వల్ల ఆ కాంట్రాక్టరును సమీపంలోని ఓ పెద్ద మెటల్ ప్లేట్ పైకి విసిరేసింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలుపాలైన ఆ కాంట్రాక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని వోక్స్వాగన్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దుర్ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అతడు విచారణ కొనసాగుతుందని తెలిపాడు.
జర్మనీ పత్రికలు మాత్రం ఈ దుర్ఘనటలో రోబో దోషిగా తేలితే ఏయే శిక్షలు వేస్తారనే వార్తా కథనాలను ప్రచురించాయి.