వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన దిలీప్ వర్మ (26) మిత్రుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
దిలీప్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందినవాడు. భారత కాలమానం ప్రకారం ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దిలీప్ వర్మ, అతని మిత్రుడు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో దిలీప్ వర్మ అక్కడికక్కడే మృత్యు ఒడిలోకి చేరాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. న్యూజెర్సీలోని హోప్వెల్లో ఈ ప్రమాదం జరిగింది.
Comments
English summary
Another Telugu Student from Bhimavaram Dileep Varma killed in a Road Accident in America.
Story first published: Saturday, April 25, 2015, 13:05 [IST]