వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ రేప్: ఆ నలుగురు కామాంధులకు ఉరి శిక్ష

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: బాలికల మీద అత్యాచారం చేసిన నలుగురు కామాంధులకు పాకిస్థాన్ లో ఉరి శిక్ష విధించారు. మంగళవారం ఇద్దరిని, బుధవారం ఇద్దరిని ఉరి తియ్యాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సలీమ్, నౌమన్ లను ఉరి తియ్యనున్నారు.

అదే విధంగా బుధవారం అబిద్ మసూద్, సనావుల్లాలను ఉరి తియ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇస్లామాబాద్ లోని సాయిల్కోట్ జిల్లా జైలులో వీరు నలుగురిని ఉరి తీస్తున్నారు. వీరు నలుగురు ఇద్దరు మైనర్ బాలిలక మీద గ్యాంగ్ రేప్ చేశారు.

the four convicts will be hanged at the Sialkot district jail

1999లో నౌమన్, సలీమ్ ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. ఇద్దరు పదేపదే అత్యాచారం చెయ్యడంతో బాలిక తీవ్రఅస్వస్థతకు గురైయ్యింది. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. బాలిక మీద అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు.

1997లో అబిద్ మసూద్, సనావుల్లా 15 సంవత్సరాల బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. పోలీసుల విచారణలో నిందితులు గ్యాంగ్ రేప్ చేసినట్లు వెలుగు చూసింది. ఇద్దరు నేరం అంగీకరించారు. వీరిద్దరిని ఏప్రిల్ 22 వ తేది బుధవారం ఉరి తీస్తున్నారు.

2014 డిసెంబర్ 16వ తేదిన పెషావర్ లోని ఆర్మి స్కూల్ మీద పడిన తాలిబన్ టెర్రరిస్టులు కాల్పులు జరిపి 150 మంది పిల్లలను పోట్టన పెట్టుకున్నారు. అప్పటి వరకు పాకిస్థాన్ లో ఉరి శిక్షపై నిషేధాన్ని ఎత్తి వేశారు. అప్పటి నుండి వివిద కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వెంటవెంటనే ఉరి శిక్ష అమలు చేస్తున్నారు.

English summary
Convicts Nauman and Saleem will be executed on Tuesday. Both of them had raped a minor girl in 1999. Abid Maqsood and Sanaullah will be hanged on April 22. They had gang-raped a 15-year-old girl in 1997.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X