వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లో ఆత్మాహుతి దాడి: 26 మంది మృతి
పాకిస్థాన్లోని లాహోర్లో కారు బాంబు దాడిలో దాదాపు 26 మంది మృతి చెందారు. పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి అతి సమీపంలోని అర్ఫా కరీమ్ టవర్ వద్ద ఈ దాడి జరిగింది.
లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్లో కారు బాంబు దాడిలో దాదాపు 26 మంది మృతి చెందారు. పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి అతి సమీపంలోని అర్ఫా కరీమ్ టవర్ వద్ద ఈ దాడి జరిగింది.
మరో 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దాడి అని లాహోర్ పోలీసు చీఫ్ అమిన్ వెయిన్స్ ధ్రువీకరించారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలుస్తోంది.
Comments
English summary
An explosion killed 20 people and injured 30 in the Pakistani city of Lahore, near the residence of Chief Minister Shahbaz Sharif, on Monday, rescue officials said. It was not clear what caused the blast.
Story first published: Monday, July 24, 2017, 22:27 [IST]