విమాన ఇంజిన్లో మంటలు: కూలి ఇద్దరు పైలట్లు మృతి
బీజింగ్: చైనా నేవీ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. చైనా నౌకాదళానికి చెందిన ఓ ఎయిర్ క్రాప్ట్ చైనా ఈశాన్య ప్రాంతంలో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో శిక్షణ ఇస్తున్న 27 ఏళ్ల పైలెట్ జియాంగ్తో పాటు శిక్షణ తీసుకుంటున్న మరో 22 ఏళ్ల పైలెట్ లు పెయింగుయ్లు ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిద్దరు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఫ్త్లెట్ స్కూల్కు చెందిన వారు.
విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటన మే 13న జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను చైనా నేవీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విమానం ఇంజిన్లో మంటలు చెలరేగిన 17 సెకన్లకే విమానం కూలిపోయిందని పేర్కొన్నారు. మంటలు చెలరేగిని విమానం నుంచి ఇద్దరు పైలెట్లు ప్యారాచూట్ సహాయంతో తప్పించుకోవడానికి యత్నించారని, తక్కువ సమయం ఉండటంతో వీరు మృతి చెందినట్లు ఆ ప్రకటనలో చైనా నేవీ పేర్కొంది.