298 మంది మృతి: రష్యా క్షిపణితో ఆ విమానాన్ని కూల్చేశారు
మాస్కో: మలేషియా ఎయిర్ లైన్స్ విమాం ఎంహెచ్ 17 విమానాన్ని రష్యా నుంచి తెచ్చిన క్షిపణి ద్వారా ఉక్రెయిన్ రెబల్స్ కూల్చివేశారని చెబుతున్నారు. ఎంహెచ్ 17 ఘటనను విచారించిన అంతర్జాతీయ ప్రాసిక్యూటర్లు పైవిధంగా స్పష్టం చేశారు.
2014, జూన్ 17న జరిగిన సంఘటనలో బోయింగ్ విమానాన్ని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కూల్చేశారు. ఆ ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉక్రెయిన్కు చెందిన రెబల్స్ తమ ప్రాంతం నుంచి మలేషియా విమానాన్ని పేల్చినట్లు అంతర్జాతీయ విచారణ కమిటీ స్పష్టం చేసింది.
రష్యాకు చెందిన బుక్ క్షిపణితో రెబల్స్ ఆ విమానాన్ని పేల్చినట్లు డచ్కు చెందిన కమిటీ తేల్చింది. విమాన ఘటనపై డచ్ సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన విల్బర్ట్ పాలిసన్ ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రష్యా నుంచి తీసుకువచ్చిన బుక్ క్షిపణి వ్యవస్థ గురించి ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు చర్చిస్తున్న ఫోన్ సంభాషణను ఆయన మీడియాకు వినిపించారు. దీని ద్వారా మలేషియా విమానాన్ని పేల్చేసింది.. రష్యాకు చెందిన క్షిపణి వ్యవస్తే అని తేల్చేశారు. ఆ క్షిపణిని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నట్లు వాళ్లు అనుమానిస్తున్నారు.