చనిపోయిన భర్త అవయవాలతో ఎయిర్ పోర్ట్లో మహిళ, అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఓ మహిళ చనిపోయిన తన భర్త పేగులు తీసుకు వెళ్తుండగా గ్రాజ్ విమానాశ్రయ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రవర్తన పైన అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత ఆమె వద్ద తనిఖీ చేయగా చనిపోయిన భర్త పేగులు కనిపించాయి. మీడియాలో వస్తున్న సమాచారం మేరకు.. ఆమె వెళ్తుండగా కస్టమ్స్ అధికారులు చూశారు. ఆమె తీరు పైన అనుమానం వ్చచింది. దీంతో ఆమె వద్ద ఉన్న లగేజీని చెక్ చేయాలని నిర్ణయించారు.
ఆమె మొరాకో నుంచి వచ్చి, గ్రాజ్ విమానాశ్రయంలో దిగారు. ఆమె వద్ద భర్త తల, ఇతర శరీర అవయవాలు కూడా గుర్తించారు. అతని నుంచి తీసిన పేగులను జాగ్రత్తగా రెండు డబ్బాలలో జాగ్రత్తగా పెట్టింది.
దీనిపై అధికారులు ఆమెను ప్రశ్నించగా.. తన భర్త అవయవాలను (ఆర్గాన్స్) తీసుకు వెళ్తున్నట్లు చెప్పింది. తన భర్తకు ఎవరో విషం ఇచ్చారని తనకు అనుమానంగా ఉందని, మెడికల్ చెకప్ కోసం తీసుకు వెళ్తున్నట్లు చెప్పింది.
గ్రాజ్ విమానాశ్రయం ఆస్ట్రేలియాలోని రెండో అతి పెద్ద నగరంలో ఉంది. ఈ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్, అంతర్జాతీయ విమానాలు వెళ్తాయి. గ్రాజ్ విమానాశ్రయం నుంచి రోజుకు ఆరువేల మంది కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు.