ముంబై: టీమిండియా బ్యాట్స్మెన్ అజ్యంకె రహానే 2015 సంవత్సరానికి గాను 'సియట్' అత్యుత్తమ భారత క్రికెటర్గా ఎంపికయ్యాడు. ఇక శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా నిలిచాడు. 1983లో భారత్కు తొలి ప్రపంచ కప్ను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల దేవ్కు జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. 'సియట్' తన 19వ వార్షికోత్సవ అవార్డుల కార్యక్రమాన్ని సోమవారం ముంబైలో నిర్వహించింది.
ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టుపై 41 పరుగులు తేడాతో విజయం సాధించి ఐపీఎల్లో రెండోసారి ఛాంపియన్గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మకు, పోయిన సంవత్సరం కోల్కత్తాలో శ్రీలంకపై వన్డేల్లో 264 పరుగులు సాధించినందుకు గాను ప్రత్యేక అవార్డుని ప్రకటించారు.
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ సాధించిన రెండో డబుల్ సెంచరీ ఇది. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం.
అవార్డులు:
అంతర్జాతీయ జీవిత కాల సాఫల్య పురస్కారం: కపిల్ దేవ్
అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్: కుమార సంగక్కర
భారత అత్యుత్తమ క్రికెటర్: అజ్యంకె రహానే
అంతర్జాతీయఅత్యుత్తమ క్రికెటర్: హాషీం ఆమ్లా
అంతర్జాతీయ అత్యుత్తమ బౌలర్: రంగనా హెర్నాత్
T20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్: డ్వేన్ బ్రావో
పాపులర్ ఛాయిస్ అవార్డు: కీరన్ పొలార్డ్
ప్రత్యేక అవార్డు: రోహిత్ శర్మ
జాతీయ అత్యుత్తమ క్రికెటర్: వినయ్ కుమార్
యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్: దీపక్ హుండా