హైదరాబాద్: ఆస్ట్రేలియన్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన టెన్నిస్ స్టార్లు సానియా మిర్జా, రోహన్ బోపన్న తమ తమ భాగస్వాములతో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్లో శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) జోడి శుభారంభం చేసింది.
యుఎస్ ఓపెన్ ఢిపెండింగ్ ఛాంపియన్స్ స్లెజిమండ్-పెవిక్ జోడిపై సానియా-డోడిగ్ జోడీ 7-5, 6-4 తేడాతో విజయం సాధించిన రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. గంటా 25 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సానియా జంట వరుస సెట్లను కైవసం చేసుకుంది.
ఆటలో భాగంగా తొలి సెట్ను ఎంతో కష్టంతో గెలిచిన సానియా జోడీ, రెండో సెట్ను సునాయాసంగా కైవసం చేసుకోవడం విశేషం. చైనా-ఆస్ట్రియా ద్వయం జెంగ్, అలెగ్జాండర్ పేయాతో ఆస్ట్రేలియా జంట సల్లీ పీర్స్, జాన్ పీర్స్తో మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలుపొందిన జోడీతో సానియా జోడీ రెండో రౌండ్లో తలపడనుంది.
మరోవైపు భారత్కు చెందిన రోహాన్ బోపన్న కెనడాకు చెందిన తన భాగస్వామి గాబ్రియెలా డాబ్రోస్కీల జోడీ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సూపర్ టై బ్రేకర్లో మిచెల్ వీనస్-కటరినా సిబోట్నిక్ జోడీపై 6-4 6-7, 10-7తేడాతో గెలుపొందారు.