న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్: రెండో రౌండ్లోకి సానియా, బోపన్న

ఆస్ట్రేలియన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన టెన్నిస్ స్టార్లు సానియా మిర్జా, రోహన్ బోపన్న తమ తమ భాగస్వాములతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన టెన్నిస్ స్టార్లు సానియా మిర్జా, రోహన్ బోపన్న తమ తమ భాగస్వాములతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో శనివారం జరిగిన తొలి రౌండ్‌లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) జోడి శుభారంభం చేసింది.

యుఎస్ ఓపెన్ ఢిపెండింగ్ ఛాంపియన్స్ స్లెజిమండ్-పెవిక్ జోడిపై సానియా-డోడిగ్ జోడీ 7-5, 6-4 తేడాతో విజయం సాధించిన రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. గంటా 25 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సానియా జంట వరుస సెట్లను కైవసం చేసుకుంది.

Australian Open: Mirza, Bopanna enter mixed doubles second round

ఆటలో భాగంగా తొలి సెట్‌ను ఎంతో కష్టంతో గెలిచిన సానియా జోడీ, రెండో సెట్‌ను సునాయాసంగా కైవసం చేసుకోవడం విశేషం. చైనా-ఆస్ట్రియా ద్వయం జెంగ్‌, అలెగ్జాండర్‌ పేయాతో ఆస్ట్రేలియా జంట సల్లీ పీర్స్‌, జాన్‌ పీర్స్‌తో మరో మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జోడీతో సానియా జోడీ రెండో రౌండ్లో తలపడనుంది.

మరోవైపు భారత్‌కు చెందిన రోహాన్ బోపన్న కెనడాకు చెందిన తన భాగస్వామి గాబ్రియెలా డాబ్రోస్కీల జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సూపర్ టై బ్రేకర్‌లో మిచెల్ వీనస్-కటరినా సిబోట్నిక్ జోడీపై 6-4 6-7, 10-7తేడాతో గెలుపొందారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X