న్యూఢిల్లీ: మెల్ బోర్న్లో జరుగుతున్న ఆస్టేలియన్ ఓపెన్ సెమీస్లో సానియా మిర్జా జోడీ ఓటమిపాలైంది. దీంతో సానియా మిర్జా జోడీ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్ నుంచి వెనుదిరిగింది. సానియా - సోరెస్ జోడీ ఫ్రెంచ్ కెనడియన్ జోడీ క్రిస్టినా మ్లదనోవిక్, డానియెల్ నెస్టర్ చేతిలో 6-3, 2-6, 8-10తో పరాజయం పాలైంది.
కాగా, భారత్ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ - మార్టినా హింగిస్ జోడీ మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకుంది.
జాతీయ క్రీడాపోటీల నుంచి వైదొలిగిన బాక్సర్ విజయేందర్
35వ జాతీయ క్రీడా పోటీల నుండి బాక్సర్ విజయేందర్ సింగ్ నుంచి వైదొలిగాడు. ముక్కుకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయేందర్ సింగ్ పేర్కొన్నాడు. 35వ జాతీయ క్రీడలు కేరళ రాష్ట్రంలో శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.