న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా ఛాంపియన్‌షిప్‌: క్వార్టర్స్‌కి దూసుకెళ్లిన సింధు

చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సత్తా చాటుతోంది. జపనీస్ క్రీడాకారిణితో బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. 

By Nageshwara Rao

హైదరాబాద్: చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సత్తా చాటుతోంది. జపనీస్ క్రీడాకారిణితో బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది.

రెండో రౌండ్‌లో భాగంగా జపాన్ క్రీడాకారిణి అయా ఓహ్రీతో జరిగిన గేమ్‌లో 21-14, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. వుహున్ స్టోర్ట్స్ సెంటర్‌లో జరిగిన ఈ గేమ్‌లో రెండు సెట్లలో పీవీ సింధు అద్భుత ప్రదర్శన చేసింది.

Badminton Asia Championships: PV Sindhu enters quarter-finals with easy win

సుమారు 40 నిమిషాల వ్యవధిలోనే సింధు తన ప్రత్యర్థిపై రెండు వరుస సెట్లలో విజయం సాధించి గేమ్‌ను గెలుచుకుంది. క్వార్టర్స్‌లో భాగంగా పీవీ సింధు చైనా క్రీడాకారిణి బింగ్‌జియోతో తలపడనుంది.

<strong>ఆసియా ఛాంపియన్‌షిప్‌: సైనా ఓటమి, సింధు విజయం </strong>ఆసియా ఛాంపియన్‌షిప్‌: సైనా ఓటమి, సింధు విజయం

ఇక పురుషుల సింగిల్స్ విషయానికి వస్తే భారత్ పోరు ముగిసింది. చైనీస్‌ తైపీ క్రీడాకారుడు సు జెన్‌తో తలపడిన అజయ్‌ జయరాం 19-21, 10-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇదిలా ఉంటే, మొదటి రౌండ్‌లో ఓటమిపాలైన సైనా నెహ్వాల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X