న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుకీతో బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్‌ పార్టీ: 'చర్యలు తీసుకోండి'

By Nageswara Rao

న్యూఢిల్లీ: బుకీతో బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ కలిసి పార్టీ చేసుకున్నాడని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐకి ఒక లేఖ రాసింది.

ఈ లెటర్‌ను బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియాకు రాసింది. బీసీసీఐలో అధ్యక్షుడి తర్వాత కార్యదర్శి పదవే అత్యున్నతమైనది. క్రికెట్‌లో తీసుకునే కీలక నిర్ణయాల్లో ఈ పదవిలోని వ్యక్తికి సముచిత స్ధానం ఉంది. అలాంటి పదవిలో ఉన్న అనురాగ్ ఠాకూర్, ఐసీసీ యాంటీ కరప్షన్, సెక్యూరిటీ జాబితాలో ఉన్న క్రికెట్ బుకీ కరణ్ గిల్హోత్రాతో కలిసి పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది.

BCCI secretary Anurag Thakur met alleged bookie: ICC

ఈ ఇంగ్లీషు టీవీ ఛానెల్‌లో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ప్రసారం చేయగా, సమాచారం అందుకున్న ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్ సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అనురాగ్ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని ఆ లెటర్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అయితే బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియా ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదంట. ఐసీసీ మెయిల్ పంపి ఇప్పటికే నాలుగు రోజులు గడిచినా ఈ విషయంపై ఎవరూ నోరు మెదప లేదని తెలుస్తోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశం అజెండాలో ఈ అంశం గురించే ప్రస్తావనకు రాలేదంట.

ఇక బీసీసీఐ సభ్యులపై మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ నెరపిన గూఢచర్యం విషయంపై దర్యాప్తు వేయనున్న కమిటీకి అనురాగ్ ఠాకూర్ నేతృత్వం వహించనున్నారు. ఇక అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం బీజీపీ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X