బెంగళూరు: బంగ్లాదేశ్తో జరిగిన రెండు వన్డేలు ఓడిన భారత జట్టుకు, కెప్టెన్ ధోనికి ఇది మంచి సమయం కాదని చెప్పవచ్చు. అయితే, ఆటగాళ్లు మాత్రం అతనికి అండగా నిలబడుతున్నారు.
కెప్టెన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని, ఏ కెప్టెన్ వెనుక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నిలబడతామని, కెప్టెన్ వెనుక వెళ్లకుంటే తుపాకీ గుళ్లకు బలవ్వాల్సిందేనని, మైదానంలో కెప్టెన్ తన ప్రాణాలు కోరితే ఇచ్చేస్తానని, అందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలని అశ్విన్ అన్నాడు. గౌరవిద్దామని రైనా ట్వీట్ చేశాడు.
🙏respect pic.twitter.com/44KMaH9m4p
— Suresh Raina (@ImRaina) June 23, 2015
అయితే, ధోనీకి మద్దతుగా ఆటగాళ్లు మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోను మాట్లాడారు. 2007లో టీట్వంటీ ప్రపంచకప్ విజయం తర్వాత రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. ధోనీ కోసం నేను వేగంగా వెళ్తున్న ట్రక్కు ఎదురు వెళ్లేందుకు సిద్ధమని చెప్పాడు.
ఇషాంత్ శర్మ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. ధోనీ చెబితే తాను 24వ అంతస్తు నుండి దూకుతానని చెప్పాడు. తన విజయంలో ధోనీ సహకారం మరువలేనిదని అజింక్యా రహానే చెప్పాడు. ఎప్పటికీ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ధోనీయేనని కోహ్లీ చెప్పాడు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆడేందుకు ఆటగాళ్లు మక్కువ చూపిస్తారని రాహుల్ ద్రావిడ్ గతంలో పేర్కొన్నాడు. తాను ఆడిన కెప్టెన్లలో ధోనీయే ది బెస్ట్ అని సచిన్ టెండుల్కర్ చెప్పాడు. వన్డేలలో ధోనీ రికార్డ్ అమోఘమని, అతనిని గౌరవించాలని సౌరవ్ గంగూలీ రెండు రోజుల క్రితం చెప్పాడు.