రియో డీ జనీరో: ఆన్లైన్ వేలంలో పరుగుల వీరుడు, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ధరించిన షూ అక్షరాలా రూ. 12 లక్షల ధర పలికింది. ఉసేన్ బోల్ట్ ధరించిన ఈ షూస్ మంగళవారం ఆన్ లైన్లో వేలం వేశారు. బోల్ట్ అభిమానులతో పాటు వ్యాపారవేత్తలు, ఔత్సాహికులు నెట్టింట్లో కూర్చోని పోటీపడ్డారు.
సుమారు ముఫ్పై బిడ్స్ తర్వాత ఈ షూస్ ఆఖరికి అక్షరాలా రూ.12 లక్షలు పలికాయి. చివరకు ఈ షూస్ 8,000 యూరోస్కు అమ్ముడుపోయాయి. ఉసేన్ బోల్ట్ సంతకం చేసి ఉన్న ఈ షూస్ను 2015 సంవత్సరంలో బీజింగ్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్లో100 మీటర్ల పరుగులో ఈ షూస్ని బోల్ట్ వేసుకున్నాడు.
ఈ షూస్ ధరించి 100 మీటర్ల పరుగులో స్వర్ణాన్ని సాధించిన బోల్ట్, ఆ తర్వాత పాల్గొన్న 200 మీటర్లు, 400 మీటర్లలో కూడా స్వర్ణాలను సొంతం చేసుకున్నాడు. కాగా ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్లో ఈ జమైకా చిరుత సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
వరుసగా మూడు ఒలింపిక్స్లో 100, 200, 400 మీటర్ల పరుగులో అతడు స్వర్ణ పతకాలు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ చరిత్రలో తన పరుగుతో అభిమానులను ఉర్రూతలూగించిన బోల్ట్ ఈ మూడు ఈవెంట్లలో మూడు ఒలింపిక్స్ల్లో మూడు స్వర్ణాలు సాధించాడు.
బీజింగ్ (2008), లండన్ (2012), రియో (2016) ఒలింపిక్స్లో వరుసగా 100మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లలో ట్రిపుల్ ట్రిపుల్ సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.