మూడో స్థానంలో రైనా ప్రమాదకర బ్యాట్స్మెన్
'మిడిల్ ఆర్డర్లో అదనపు బ్యాట్స్మన్ను తీసుకునే అవకాశం లేదు. రైనా లాంటి ఆటగాడు మూడో స్థానంలో మరింత ప్రమాదకర బ్యాట్స్మన్ అవుతాడు. కాబట్టి ఓపెనర్ రోహిత్ లేకపోతే నేను ఏ సమయంలోనైనా బాధ్యతలు తీసుకుంటా. జట్టుకు సమతూకం తేవాలన్నదే నా ఉద్దేశం' అని కోహ్లీ తెలిపాడు.
ఓపెనర్గా దిగాలన్న కోరిక నాకేమీ లేదు
అంతేతప్ప తనకు ఓపెనర్గా దిగాలన్న కోరిక నాకేమీ లేదని కోహ్లీ పేర్కొనడం విశేషం. రెండో వన్డేలో కూడా ఓపెనింగ్ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు గాను పరిస్థితిని బట్టి ఆలోచిస్తానని చెప్పాడు. జట్టులో రోహిత్ ఉంటే కచ్చితంగా కేఎల్ రాహుల్తో అతడే ఓపెనింగ్ వస్తాడని చెప్పాడు.
రోహిత్ శర్మ ఉంటే అతడే మా ఛాయిస్
అయితే గాయం కారణంగా ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే, టీ20 సిరిస్కు రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే. తొలి టీ20లో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమైన నేపథ్యంలో ఓపెనర్లు నిలకడగా రాణిస్తే భారీ స్కోర్లు చేసేందుకు అవకాశం ఉంటుందని కోహ్లీ పేర్కొన్నాడు.
7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్
కాన్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 147 పరుగులు చేసింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 18.1 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.
మూడు వన్డేల సిరిస్ను 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యం
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 51 పరుగులు చేయగా, జోరూట్ 46, బిల్లింగ్స్ 22, జాసన్ రాయ్ 19 పరుగులు చేశారు. దీంతో మూడు వన్డేల సిరిస్ను 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్ 2 వికెట్లు తీసుకోగా, పర్వేజ్ రసూల్ ఒక వికెట్ తీసుకున్నాడు.