మొహాలి: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా న్యూజిలాండ్తో మొహాలి వేదికగా ఆదివారం (అక్టోబర్ 22)న జరగనున్న మూడో వన్డేలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని సాధించనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఆదివారం జరగనున్న మ్యాచ్లో ధోని 22 పరుగులు చేస్తే వన్డే క్రికెట్లో 9000 పరుగుల మైలురాయికి చేరుకుంటాడు. 35 ఏళ్ల ధోని భారత్ తరుపున 280 వన్డేలాడి 8,978 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉండగా, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
డిసెంబర్ 23, 2014న బంగ్లాదేశ్లోని చిట్టగ్యాంగ్లో ధోని అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో ఒక బంతిని ఎదుర్కొన్న ధోని రనౌట్ కావడంతో డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆడిన రెండు వన్డేల్లో కూడా 12,7 పరుగులు మాత్రమే చేశాడు.
అలెన్ బోర్డర్కు షాక్: వన్డే కెప్టెన్గా ధోని ఖాతాలో మరో రికార్డు
అయితే విశాఖపట్నంలో పాకిస్థాన్పై జరిగిన వన్డే మ్యాచ్లో 148 పరుగులు చేసి అంతర్జాతీయ క్రీడాకారుల దృష్టిని ఆకర్షించాడు. ఆనాటి ఈనాటి వరకు ధోని కెప్టెన్గా, వికెట్ కీపర్గా బ్యాట్స్ మెన్గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు.
మూడో వన్డేలో ధోని 9000 పరుగుల మైలురాయిని అందుకుంటే ఇండియన్ బ్యాట్స్మెన్ ఎలైట్ గ్రూపులో ధోని చేరతాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, అజారుద్దీన్ తర్వాత 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
మొత్తంగా చూస్తే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న 17వ బ్యాట్స్ మెన్. భారత్ తరుపున 90 టెస్టులాడిన ధోని 4,876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్ నుంచి 2014లో ధోని వైదొలగాడు.
32వ సారి కోహ్లీ: ధర్మశాల వన్డేలో నమోదైన రికార్డులివే
దీంతో పాటు తన క్రికెట్ కెరీర్లో మూడు ఐసీసీ ట్రోఫీలు(2007లో వరల్డ్ టీ20, 2011లో వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ) అందుకున్న కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు. భారత బ్యాట్స్మెన్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు: టాప్ 5 (అక్టోబర్ 22, 2016 నాటికి)
1. Sachin Tendulkar - 18,426 runs (463 matches)
2. Sourav Ganguly - 11,363 (311)
3. Rahul Dravid - 10,889 (344)
4. Mohammad Azharuddin - 9,378 (334)
5. MS Dhoni - 8,978 (280)