పోటాపోటీగా మూడో టెస్టు
రాంచీలో జరగనున్న మూడో టెస్టు మరింత పోటాపోటీగా జరిగే అవకాశం ఉందన్నాడు. ‘ఇది ఎంతో కీలకమైన మ్యాచ్. సిరీస్ 1-1తో సమమైన నేపథ్యంలో మూడో టెస్ట్లో ఇరు జట్లూ తీవ్రంగా పోరాడవచ్చు. అయితే అంతిమంగా క్రికెట్టే గెలుస్తుంది' అని చెప్పుకొచ్చాడు. రెండో టెస్టులో కోహ్లీ, స్మిత్ మధ్య తలెత్తిన వివాదంపై బీసీసీఐ, సీఏ బోర్డులు రాజీకి రావడం శుభపరిణామమని చెప్పాడు.
ఎంతో పరిణతితో వ్యవహారించారు
టీమిండియా సాధించిన అద్భుత విజయం మరుగున పడిపోకుండా ఎంతో పరిణతితో వివాదం సమసేలా చర్యలు తీసుకుందని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చించి డీఆర్ఎస్ వివాదంపై బీసీసీఐ రాజీకి రావడం సముచిత చర్య అని కొనియాడాడు. అంతేకాదు, బెంగుళూరులో జరిగిన దాన్ని మరచి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నాడు.
కుంబ్లే, స్మితలు మాట్లాడుకున్నారు
ఇక రెండో టెస్టు తర్వాత కుంబ్లే, స్మితలు మాట్లాడుకున్నారా? అంటే.. అవును అని కుంబ్లే సమాధానమిచ్చాడు. తొలి టెస్టు కోల్పోయిన తర్వాత కోహ్లీసేన పుంజుకున్న తీరు అద్భుతమని కుంబ్లే కొనియాడాడు. ముఖ్యంగా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ను కొనియాడారు.
దానివల్లే విజయం సాధ్యమైంది
రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఓపెనర్ కెఎల్ రాహుల్ సరైన సమమాల్లో రాణించి మంచి భాగస్వామ్యాలు అందించడంతో విజయం సాధ్యమైందని కుంబ్లే చెప్పాడు. పేసర్ ఉమేశ్ యాదవ్ ఐదు వికెట్లు తీయాలని ప్రయత్నించడం శుభసూచకమని అన్నాడు. కోహ్లీ నాలుగు వరస సిరీస్లలో డబుల్ సెంచరీలతో చెలరేగడం, అశ్విన్ ఫాస్టెస్ట్ 250 వికెట్ల వీరుడిగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందన్నాడు.