న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాతో ఏకైక టెస్టు: అమిత్ మిశ్రా అవుట్, యాదవ్ ఇన్

ఫిబ్రవరి 9 నుంచి బంగ్లాదేశ్‌‌తో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా దూరమయ్యాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిబ్రవరి 9 నుంచి బంగ్లాదేశ్‌‌తో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా మిశ్రా ఈ టెస్టుకు దూరమవడంతో అతడి స్ధానంలో యువ ఆటగాడు కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించారు.

Amit Mishra out of Bangladesh Test, Kuldeep Yadav called up

ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 1న జరిగిన చివరి టీ20లో అమిత్ మిశ్రా ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మిశ్రా మోకాలికి గాయమైందని, దీంతో అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించినట్లు బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.

22 ఏళ్ల కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు టీమిండియా సీనియర్ జట్టు తరుపున ఆడలేదు. అండర్ 19, ఇండియా ఏ జట్లు తరుపున టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో ముగిసిన వార్మప్ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు (1/32, 2/2) తీసుకున్నాడు.

గత నెలలో ఇంగ్లాండ్‌తో ముంబైలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అక్టోబర్, 2014లో వెస్టిండిస్ సిరిస్ కోసం తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుని నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరిస్‌లను గెలుచుకుని టీమిండియా మంచి జోరు మీదుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X