కోచ్ జీతాన్ని రూ. 7.5 కోట్లకు పెంచాలి
ప్రధాన కోచ్ సంవత్సర జీతాన్ని రూ. 6.5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్లకు పెంచాలి. కోచ్కు కెప్టెన్ సంపాదించే మొత్తంలో 60 శాతం వరకు వేతనంగా ఇవ్వాలి. అంతర్జాతీయ టోర్నీల్లో టీమిండియా ప్రదర్శన ఆధారంగా జీతంలో 30 శాతాన్ని బోనస్గా పొందేందుకు కోచ్ అర్హుడిగా ఉండాలి. దీని ప్రకారం జట్టు సారథికి బీసీసీఐ అధికంగా చెల్లించిన ప్రతిసారీ కోచ్ ఆదాయం కూడా పెరుగుతుంది.
బ్యాటింగ్ కోచ్ జీతం రూ. 2.25 కోట్లు
టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ జీతాలపై కూడా కుంబ్లే నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నాడు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వేతనాన్ని రూ. కోటి నుంచి రూ. 2.25 కోట్లకు.. ఫీల్డింగ్ కోచ్ వేతనాన్ని రూ. కోటి నుంచి రూ. 1.75 కోట్లకు పెంచాలి.
ఐపీఎల్ సమయంలో కాంట్రాక్ట్ అమల్లో ఉండదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడే సమయంలో ఆటగాళ్ల కాంట్రాక్ట్ అమల్లో ఉండదు. అలాగే కోచ్లకు ఐపీఎల్ జట్లతో కలిసి పనిచేసే అవకాశమివ్వాలి. దీని వల్ల వారు మరింత ఆదాయం పొందడంతో పాటు టీ20 మ్యాచ్ల విషయంలో మరింత అనుభవాన్ని గడిస్తారు.
వరల్డ్ కప్ సాధిస్తే నజరాజాగా 2 కోట్లు
భారత జట్టు వన్డే వరల్డ్ కప్ని సాధిస్తే ఆటగాళ్లకు రూ. 2 కోట్లు నజరానాగా ఇవ్వాలి. ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టీ20 సాధిస్తే రూ. కోటిని అందజేయాలి. ఇలా కుంబ్లే బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ)తో ఆటగాళ్ల జీతాల విషయంలో గట్టిగానే పోరాడాడు. అయినా సరే కుంబ్లే ఆటగాళ్లను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నాడని అతడిపై సీఏసీకి ఫిర్యాదు చేయడం, కుంబ్లే-కోహ్లీ విభేదాలతో కోచ్ పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయి.