ధర్మశాల: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా తొలుత అనిల్ కుంబ్లేను అనుకోలేదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకుర్ ఆసక్తికర విషయం చెప్పాడు. కుంబ్లే తమ తొలి ఛాయిస్ కాదని చెప్పాడు. గురువారం నాడు కుంబ్లేను టీమిండియ్ హెడ్ కోచ్గా నియమించిన విషయం తెలిసిందే.
తాము మొదట రాహుల్ ద్రావిడ్ను కోచ్గా నియమించాలని భావించామని చెప్పాడు. భారత జట్టుకు కోచ్గా ఉండాలని తాను ద్రావిడ్ను కోరానని, ఆయన కాదనలేదని, అయితే, జూనియర్ జట్టు కోసం పని చేస్తానని చెప్పాడు.
హెడ్కోచ్గా కుంబ్లే, బ్యాటింగ్ కోచ్గా శాస్త్రి: కోహ్లీ చక్రం!
రాహుల్ ద్రావిడ్ మంచి గుణం అదేనని, సీనియర్ టీంకు కోచ్గా ఉండి, అధిక డబ్బు పేరు తెచ్చుకోవాలని భావించకుండా, చిన్నారులను మెరుగైన క్రికెటర్లుగా తీర్చి దిద్దాలని భావించాడన్నాడు. కాగా, బీసీసీఐ సలహా సంఘంలో గంగూలీ, లక్ష్మణ్, సచిన్ లతో పాటు కొనసాగాలని ద్రావిడ్ను కోరినా ఆయన అంగీకరించలేదనే విషయం తెలిసిందే.
కెప్టెన్లకు..
కుంబ్లేను ఏడాది పాటు జట్టు హెడ్ కోచ్గా ఎంపిక చేసినట్లు ప్రకటించిన మరుక్షణమే రంగంలోకి దిగిపోయిన స్పిన్ దిగ్గజం టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలకు తొలి సందేశాలు పంపాడు. జింబాబ్వేలో రెండు సిరీస్లు గెలిచిన ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ ట్వీట్ చేసిన కుంబ్లే. అతడితో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు.
ఇక టెస్ట్ కెప్టెన్కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసిన కుంబ్లే అతడితోనూ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ.. అనిల్ కుంబ్లే కోచ్గా నియామకం కావడంపై స్పందించాడు. మీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉందని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, కుంబ్లే నుంచి కోహ్లీ చాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.