హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా గాలే వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు బుధవారం ప్రారంభమైంది. ఈ టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు అరంగేట్రం చేయగా, టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు 50వ టెస్టు.
ప్రత్యేకం: గాలే టెస్టు అశ్విన్ కెరీర్లో ఓ మైలురాయి
ఈ టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అదే గనుక బ్యాటింగ్ ఎంచుకుంటే కోహ్లీ తొలుత బంతినిచ్చేది రవిచంద్రన్ అశ్విన్ చేతికే. ఈ టెస్టులో అశ్విన్ స్పిన్ మాయాజాలాన్ని మనం చూడాలంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే.
అశ్విన్ 50వ టెస్టు నేపథ్యంలో అతడి భార్య ప్రీతి నారాయణన్, ఇద్దరు పిల్లలు గాలే స్టేడియంలో బుధవారం సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా, లంక పర్యటనలో భారత ప్రధాన అస్త్రంగా అశ్విన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గతేడాది గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు ఆడే ముందు అశ్విన్ వేరు... ఆ తర్వాత అశ్విన్ వేరు. అప్పటి వరకు ఆడిన 25 టెస్టుల్లో అతను 98 వికెట్లు మాత్రమే తీశాడు. భారత్ ఆడిన గత 13 టెస్టుల్లో అశ్విన్ని 7 మ్యాచ్లలో పక్కన పెట్టారు. అయితే రెండేళ్ల క్రితం గాలే టెస్టు అశ్విన్ తల రాతను మార్చింది.
ఈ మ్యాచ్లో తొలి రోజు ఆరు వికెట్లు సహా మొత్తం అతను 10 వికెట్లు తీశాడు. అంతే అశ్విన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత అతడు ఆడిన 24 టెస్టుల్లో ఏకంగా 151 వికెట్లు తీశాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు.
అశ్విన్ ఇప్పటివరకు 49 టెస్టుల్లో 25.22 సగటుతో 275 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్లో 5 వికెట్లు 25 సార్లు తీయగా... మ్యాచ్లో 10 వికెట్లు 7 సార్లు తీశాడు.