ప్లానింగ్తో అశ్విన్ బౌలింగ్
ప్లాన్తో బౌలింగ్ చేస్తాడు. కొన్ని పరిస్థితుల్లో అతడు వికెట్లు తీయలేకపోవచ్చని, అయితే పిచ్పై పగుళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అశ్విన్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని పుజారా వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ రెండు వికెట్లు మాత్రమే తీసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అశ్విన్ను పుజారా వెనకేసుకొచ్చాడు.
రెండో సెషన్ లోపు టీమిండియాకు విజయం
బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో చివరి రోజైన సోమవారం రెండో సెషన్ లోపు టీమిండియాకు విజయం ఖాయమవుతుందని పుజారా విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘పిచ్పై బంతి తిరగడం మొదలైంది. అశ్విన్, జడేజా బౌలింగ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడతారు. మిగిలిన ఏడు వికెట్లు రెండు సెషన్స్లో లభిస్తాయని అనుకుంటున్నా' అని పుజారా అన్నాడు.
దూకుడుగా ఆడటానికి బలమైన కారణాలున్నాయి
మరోవైపు బంగ్లా టెస్టు తొలి ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడటానికి బలమైన కారణాలే ఉన్నాయని పుజారా చెప్పుకొచ్చాడు. 'నేను ఒక టెస్టు ఆటగాడిని అనే ముద్ర ఉంది. ఆ ముద్ర సాధ్యమైనంత తొందరగా చెరిగిపోవాలి. నేను అన్ని ఫ్మార్మాట్లకు సరిపోతాననే విషయం తెలుసు. ఆ క్రమంలోనే దూకుడైన ఆటను ఆడుతున్నా' అని పుజారా పేర్కొన్నాడు.
58 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 54 పరుగులు
రెండో ఇన్నింగ్స్లో 58 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 54 పరుగులతో పుజారా నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే.