విదేశాల్లో మినీ ఐపీఎల్పై రాజీవ్ శుక్లా
‘విదేశాల్లో మినీ ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని గత కొంతకాలంగా బీసీసీఐలో చర్చిస్తున్నాం. ఐపీఎల్కి ఆదరణ ఎలా పెరుగుతుందో గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఛాంపియన్ లీగ్ టీ20 ఆలోచన ఫెయిల్ అయ్యింది. అందుకే దాని స్థానంలో మినీ ఐపీఎల్ నిర్వహించాలని యోచిస్తున్నాం. ఈ టోర్నీకి దుబాయ్ మంచి వేదికని మా భావన' అని రాజీవ్ శుక్లా వివరించారు.
ఐపీఎల్ 11వ సీజన్లో చాలా మార్పులు
వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 11వ సీజన్లో చాలా మార్పులు ఉంటాయని, అభిమానులను ఈ టోర్నీ ఎంతగానో అలరిస్తుందని ఆయన అన్నారు. రాబోయే పదేళ్ల కాలంలో ఐపీఎల్ మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా, ఆకట్టుకునేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శుక్లా తెలిపారు.
వెన్యూ పంపిణీ విధానంలోనూ మార్పులు
దీని కోసం బీసీసీఐ రెవెన్యూ పంపిణీ విధానంలోనూ మార్పులు చేయాలనుకుంటున్నామని, ఫ్రాంచైజీ జట్టు బీసీసీఐతో రెవెన్యూ పంచుకునే విధానం గురించి ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఐపీఎల్లో 8 జట్లే ఆడతాయని, 10 జట్లు పాల్గొంటే టోర్నీ సుదీర్ఘంగా మారిపోతుందని ఆయన వివరించారు.
యువ క్రికెటర్లకు ఎంతో లాభం
ఇదిలా ఉంటే ఐపీఎల్ పదో సీజన్లో పాల్గొన్న ఎంతో మంది ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటారని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీకి ముందు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్లకు ఎంతో లాభించిందని, ఫిట్నెస్ మెరుగుపరుచుకుని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్ధాయి ఆటగాళ్లతో భారత్కు చెందిన యువ క్రికెటర్లు కలిసి ఆడటం వల్ల వారికి ఎంతగానో లాభిస్తుందని అన్నారు.