హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతోంది. ప్రపంచంలోని మిగతా క్రికెట్ సంఘాలతో పోలిస్తే బీసీసీఐ ట్విట్టర్ ఖాతాను ఫాలో చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
ఇటీవలే ట్విట్టర్లో బీసీసీఐని ఫాలో చేస్తున్న వారి సంఖ్య 50 లక్షలకు చేరింది. దీంతో మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐ ఎవరికీ అందనత ఎత్తులో ఉంది. ఈ సందర్భంగా బీసీసీఐ అభిమానుల కోసం తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని పోస్టు చేసింది.
5 Million and counting. Thank you for your support #TeamIndia pic.twitter.com/cb59JxBpTa
— BCCI (@BCCI) 21 August 2017
అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మాజీ కెప్టెన్ ధోని, యువ ఆటగాళ్లు మనీష్ పాండే, కేదార్ జాదవ్లు 5 మిలియన్ మార్కు చూపిస్తూ ఫోజులిచ్చారు. ఇదిలా ఉంటే ట్విటర్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న టాప్-10 బోర్డులు ఇలా ఉన్నాయి.
* బీసీసీఐ - 50 లక్షలు
* బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు - 15 లక్షలు
* దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు - 8,64,000
* క్రికెట్ ఆస్ట్రేలియా - 8,14,000
* పాకిస్థాన్ క్రికెట్ బోర్డు - 7,46,000
* ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు - 6,97,000
* శ్రీలంక క్రికెట్ బోర్డు - 5,40,000
* న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు - 3,52,000
* వెస్టిండిస్ క్రికెట్ బోర్డు - 2,27,000
* జింబాబ్వే క్రికెట్ బోర్డు - 1,61,000
ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 24 (గురువారం) పల్లెకెలె వేదికగా జరగనుంది.