హైదరాబాద్: మహిళల ప్రపంచకప్లో భారత జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్ప్రీత్ కౌర్కు ఆదివారం పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో కౌర్ 20 ఫోర్లు 7 సిక్సుల సాయంతో 171 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఉమెన్ వరల్డ్ కప్: విజేతగా ఇంగ్లాండ్, పోరాడి ఓడిన మిథాలీ సేన
హర్మన్ ప్రీత్ కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ఆమెకు రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌర్ పంజాబీ బిడ్డ అయినందుకు గర్విస్తున్నాని, కౌర్ ప్రదర్శన పంజాబీలంతా గర్వించేలా చేసిందని సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు.
అంతేకాదు కౌర్ మరో అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ సాధిస్తుందని, కెరీర్లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె తండ్రి హర్మందర్ సింగ్కు అభినందనలు తెలిపారు. కౌర్ తల్లిదండ్రులను తన వద్దకు పిలిపించుకొని ఆయన ఆదివారం అభినందించారు.
ఈ సందర్భంగా హర్మన్కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. భారత్ మహిళల జట్టు వరల్డ్ కప్ ఫైనల్కు చేరడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్ అందర్ని గర్వించేలా చేసిందని, ఆమెకు పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్సింగ్ చెప్పారు.
గతంలో ప్రకాశ్సింగ్ బాదల్ సారథ్యంలోని ప్రభుత్వం హర్మన్ప్రీత్కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించిందనీ ఈ సందర్భంగా సీఎం అమరీందర్ ఆరోపించారు.