పీకల్లోతు కష్టాల్లో కివీస్
జడేజా తర్వాతి ఓవర్లోనే క్రీజు ముందుకొచ్చి కొలిన్ గ్రాండ్హోమ్ (4) స్టంపౌటవడంతో 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసపటికే మిచెల్ శాంట్నర్ (12)ను అశ్విన్ పెవిలియన్ చేర్చడంతో 126/7తో నిలిచిన కివీస్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనిపించింది. కానీ చివర్లో నీషమ్ చక్కగా రాణించాడు. వచ్చీరాగానే అశ్విన్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను టెయిలెండర్ల సహకారంతో జట్టు స్కోరు 150 దాటించాడు. కాగా.. ఉమేష్ చక్కటి షార్ట్ బాల్తో ఆడమ్ మిల్నే (9)ను అవుట్ చేయగా.. ఆ వెంటనే టిమ్ సౌథీ (4)ని భువీ తొమ్మిదో వికెట్గా పెవిలియన్ చేర్చాడు.
ఆఖరి వికెట్గా ట్రెంట్ బౌల్ట్
భువీ వేసిన 39వ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ (9) ఆఖరి వికెట్గా వెనుదిరగగా.. నీషమ్ మాత్రం నాటౌట్గా నిలిచాడు. భువనేశ్వర్, మహమ్మద్ షమీ మూడేసి వికెట్లు తీయగా... జడేజాకు రెండు వికెట్లు తీశాడు. స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్ కీలకంగా నిలిచారు. రెండో ఓవర్లోనే క్యాచ్ అవుటయ్యే ప్రమాదం నుంచి ధావన్ తప్పించుకోగా ఐదో ఓవర్లో రహానే (7) రూపంలో జట్టు తొలి వికెట్ను కోల్పోయింది. హుక్ షాట్కు ప్రయత్నించిన రహానే స్క్వేర్ లాంగ్ లెగ్లో బౌల్ట్కు దొరికిపోయాడు.
నిలకడగా కోహ్లి, ధావన్ జోడి
ఆ తర్వాత కోహ్లి, ధావన్ జోడి నిలకడగా ఆడుతూ అండగా నిలిచింది. వీరిద్దరి ఆటలో దూకుడు లేకపోయినా అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచారు.అయితే అర్ధసెంచరీ వైపు పయనిస్తున్న ధావన్ను 19వ ఓవర్లో నీషమ్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓవర్ వ్యవధిలోనే దినేశ్ కార్తీక్ కూడా డకౌట్గా వెనుదిరిగాడు. అటు సరిగ్గా 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లికి ధోని (21 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తోడవ్వడంతో స్కోరులో కాస్త వేగం పెరిగింది.
26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు
ఈ క్రమంలో 26 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వర్షం తగ్గలేదు. అప్పటికి డకవర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం ఖాయం కావడానికి 26 ఓవర్లలో 84 పరుగులుగా ఉంది. టీమిండియా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతో భారత్ నెగ్గినట్టు ప్రకటించారు. చూడచక్కని షాట్లతో అలరించిన విరాట్ కోహ్లి (55 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, శిఖర్ ధావన్ (59 బంతుల్లో 40; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనారోగ్యం వల్ల యువరాజ్, సోదరి వివాహం కారణంగా ఆలస్యంగా ఇక్కడికి చేరుకున్న రోహిత్ శర్మ తొలి వార్మప్ మ్యాచ్ ఆడలేదు. ఇక మంగళవారం జరిగే రెండో వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ ఆడుతుంది.