హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం లండన్లో ఓ మహిళా భద్రతాధికారితో మాట్లాడుతూ కనిపించారు. వివరాల్లోకి వెళితే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం టీమిండియా, న్యూజిలాండ్తో తలపడింది. ఈ వార్మప్ మ్యాచ్కి ముందు విరాట్ కోహ్లీ ద ఓవల్ స్టేడియంలో గస్తీ కాస్తున్న మహిళా పోలీసు అధికారితో ముచ్చటించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విధి నిర్వహణలో ఉన్న ఓ భద్రతాధికారిణితో కోహ్లీ నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. వార్మప్ మ్యాచ్కు వెళ్లడానికి ముందు కోహ్లీ భద్రతాధికారిని పలుకరించి ఆమెతో ముచ్చటించాడని బీసీసీఐ కామెంట్ పెట్టింది. గత వారం మాంచెస్టర్లో జరిగిన ఉగ్రదాడిలో 22మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు.
#TeamIndia skipper @imVkohli interacting with security personnel before leaving for The Oval #IndvNZ #CT17 pic.twitter.com/fbyg9NANLW
— BCCI (@BCCI) May 28, 2017
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. మాంచెస్టర్ ఉగ్ర దాడిపై అంతకుముందు టీమిండియా కెప్టెన్ కోహ్లీ తీవ్రంగా ఖండించాడు. ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం తమను బాధించిందని పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటన క్రికెట్పై పెద్దగా ప్రభావం చూపలేదని కోహ్లీ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కోహ్లీ అన్నాడు.
ఇక, ఛాంపియన్స్ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన భద్రతపై కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని, వాటిని దృష్టిలో పెట్టుకుని మేం ఇక్కడ మసులుకోవాలని కోహ్లీ అన్నాడు. ఏ ప్రాంతాలకు ఏఏ సమయాల్లో వెళ్లొచ్చో స్పష్టంగా చెబుతున్నారు. వెళ్లకూడని ప్రదేశాల గురించి ముందే వివరిస్తున్నారు అని కోహ్లీ వెల్లడించాడు.