హైదరాబాద్: న్యూజిలాండ్పై విజయం సాధించడంలో ఇంగ్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించారని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కార్డిఫ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 87 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
అంతేకాదు టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. దీంతో, 4 పాయింట్లతో సెమీస్ బెర్తు సాధించింది. గ్రూప్-ఎలో మిగతా జట్లలో 4 పాయింట్లు సాధించే అవకాశం ఒక్క ఆస్ట్రేలియాకు మాత్రమే ఉండటంతో ఇంగ్లాండ్కు సెమీస్ బెర్తు ఖాయమైంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ మోర్గాన్ మీడియాతో మాట్లాడాడు. ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ 300కు పైగా పరుగులు చేస్తున్న తరుణంలో ఈ మ్యాచ్లో 10 లేదా 15 పరుగులు తక్కువ అవుతాయని తాను భావించినట్లు మోర్గాన్ తెలిపాడు. ఈ మ్యాచ్లో వుడ్ అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు.
ఇక బౌలర్లు కూడా తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 310 పరుగులు చేసి అలౌటైంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్ (64), జోస్ బట్లర్ (61 నాటౌట్), అలెక్స్ హేల్స్ (56) పరుగులతో అర్ధసెంచరీలు చేశారు.
బెన్స్టోక్స్ (48; 53 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులు) పరుగులతో ఆకట్టుకున్నారు. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు మంచి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్ రాంకి (0) ఆరంభంలోనే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ గప్తిల్ (27), రాస్ టేలర్ (39)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
కివీస్పై ఘన విజయం: సెమీస్కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లాండ్
ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (87; 98 బంతుల్లో 8 ఫోర్ల)తో చక్కని పోరాటం చేశాడు. అతడు ఉన్నంత సేపు కివీస్ లక్ష్యం వైపు సాగింది. 30 ఓవర్లకు 158/2తో కివీస్ లక్ష్యం దిశగా సాగింది. ఆ తర్వాత విలియమ్స్ నిష్క్రమణతో అంతా మారిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి కివీస్ను లక్ష్యానికి దూరం చేశారు.