న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన కలయిక: ధోని చేతిలో ఉన్న బుడతడు ఎవరు?

By Nageshwara Rao

హైదరాబాద్: జూన్ 18 (ఆదివారం) ఫాదర్స్ డే. ఇదే రోజు ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగనుంది. ఈ పైనల్ మ్యాచ్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్ధాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యంత అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఆ ఫోటోలో పాకిస్థాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ కుమారుడు అబ్దుల్లాను ఎత్తుకొని ముద్దుచేస్తున్నాడు. ఆదివారం తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడుతుండటంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ సంచలనంగా మారింది. మామూలుగా భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులకు ఎంతో ఉత్సుకత ఉంటుంది.

అలాంటిది క్రికెట్ ఛాంపియన్స్‌గా నిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అంటే మాటలా. ఈ మ్యాచ్ ముగిసిన వారం రోజుల పాటు ఈ మ్యాచ్ ప్రభావం ఇరు దేశాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ధోని పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ఇప్పుడు భారత, పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్ఫరాజ్ అహ్మద్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్యూలో సర్ఫరాజ్ మాట్లాడుతూ ధోని అంటే తనకెంతో ఇష్టమని అతడి నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు పేర్కొన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే గ్రూప్ బీలో జూన్ 4వ తేదీన జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో మరోసారి ఇరు జట్లు తలపడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X