హైదరాబాద్: జూన్ 18 (ఆదివారం) ఫాదర్స్ డే. ఇదే రోజు ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగనుంది. ఈ పైనల్ మ్యాచ్లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్ధాన్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యంత అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఆ ఫోటోలో పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కుమారుడు అబ్దుల్లాను ఎత్తుకొని ముద్దుచేస్తున్నాడు. ఆదివారం తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో టీమిండియా తలపడుతుండటంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ సంచలనంగా మారింది. మామూలుగా భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులకు ఎంతో ఉత్సుకత ఉంటుంది.
A nice pic ahead of the Champions Trophy finals. @msdhoni with Sarfraz Ahmed baby: sports beyond boundaries!! #IndVsPak pic.twitter.com/8WNAlHzf4B
— Rajdeep Sardesai (@sardesairajdeep) June 17, 2017
అలాంటిది క్రికెట్ ఛాంపియన్స్గా నిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అంటే మాటలా. ఈ మ్యాచ్ ముగిసిన వారం రోజుల పాటు ఈ మ్యాచ్ ప్రభావం ఇరు దేశాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ధోని పోస్ట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు భారత, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్ఫరాజ్ అహ్మద్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్యూలో సర్ఫరాజ్ మాట్లాడుతూ ధోని అంటే తనకెంతో ఇష్టమని అతడి నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు పేర్కొన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే గ్రూప్ బీలో జూన్ 4వ తేదీన జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో మరోసారి ఇరు జట్లు తలపడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.
Dhoni is a class #respect https://t.co/uxymhXZ55A
— Sobia Hussain Abbasi (@Sobia_abbasi00) June 17, 2017
Perfect gentleman to play gentleman's game. #CT17 #Dhoni #INDvPAK #CT17Final https://t.co/VPkCX7YzWD
— sandeep.madderla (@sandpmadderla) June 17, 2017