హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఎడ్జిబాస్టన్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడాన్ని చూడటం చాలా బాధగా ఉందని పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో 124 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) పాక్పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్, ఫోటోలు , స్కోరు కార్డు
ఈ మ్యాచ్పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'ఓ ఆటగాడిగా గెలుపు ఓటములు అనేవి మ్యాచ్లో సహజం. అయితే భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ పోరాడకుండానే ఓడిపోవడం బాధాకరం' అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
As a sportsman I know winning & losing are part of the game but it's painful to watch Pak being thrashed by India without putting up a fight
— Imran Khan (@ImranKhanPTI) June 4, 2017
దేశంలో అపారమైన ప్రతిభ ఉందని, ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు. 'పాకిస్థాన్ క్రికెట్ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అలా చేయని పక్షంలో భారత్-పాక్ జట్లలోని ఆటగాళ్ల టాలెంట్ మధ్య అంతరం భారీగా పెరుగుతుంది' అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు.
Unless Pak cricket structure is totally revamped/reformed, despite an abundance of talent the gap between Pak & India will keep increasing
— Imran Khan (@ImranKhanPTI) June 4, 2017
అంతేకాదు భారత్తో జరిగే మ్యాచ్ల్లో ఇలాంటి తీవ్ర నిరాశాజనక పరాజయాలు ఎదురవుతూనే ఉంటాయని తెలిపాడు. ప్రొఫెషనల్ మెరిట్ ఆధారంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ని కూడా ఎంపిక చేయాలని కూడా ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సూచించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
Pak cricket cannot be fixed if the Chairman of the PCB is not appointed on professional merit.
— Imran Khan (@ImranKhanPTI) June 4, 2017
ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మ్యాచ్కి వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. దీంతో టోర్నీలో తొలి మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 124 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.