|
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉమేశ్ యాదవ్
న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్ అనంతరం టీమిండియా డిన్నర్ పార్టీ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను పేసర్ ఉమేశ్ యాదవ్ అభిమానులతో పంచుకున్నాడు.
|
విరాట్ కోహ్లీ సైతం
జట్టు సహచరులతో కలిసి డిన్నర్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
|
శిఖర్ ధావన్
జట్టు సహచరుతలో కలిసి స్టేడియానికి వెళ్తున్న సందర్భంలో ఫోటోను తీసి ఇనిస్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్.
|
యువరాజ్ సింగ్
జ్వరం కారణంగా యువీ వార్మప్ మ్యాచ్ ఆడలేదు.
జ్వరం కారణంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్కి టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ దూరమయ్యాడు. అయితే ఇనిస్టాగ్రామ్లో త్రీ మిలియన్ ఫాలోవర్లు అయినందుకు ధన్యవాదాలు తెలిపాడు.
|
లండన్ చేరుకున్న రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం లండన్ చేరుకున్నాడు. గత వారం కోహ్లీ సేన ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరే జట్టులో రోహిత్, కేదార్ జాదవ్లు లేని సంగతి తెలిసిందే. బంధువుల ఇంట్లో వివాహానికి హాజరు కావడం కోసం రోహిత్ బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడు. కేదార్కు వీసా సమస్య రావడంతో అతను వెళ్లలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆదివారం లండన్ బయలుదేరినట్లు తన ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా తెలిపాడు.