'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో ఛాలెంజ్
ఛాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటరీ చేసేందుకు గాను పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు లండన్కు చేరుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా కొన్ని రోజుల క్రితం 'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా గంగూలీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వార్న్, మైకేల్ క్లార్క్లు పాల్గొన్నారు.
ఫేవరేట్ జట్లను ఎంపిక చేసిన గంగూలీ, వార్న్, మైకేల్ క్లార్క్
ఇందులో భాగంగా ఈ ముగ్గురూ తమ తమ ఫేవరేట్ జట్లను ఎంపిక చేశారు. ఈ క్రమంలో జూన్ 18న జరిగే ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడతాయని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేయగా, గంగూలీ వ్యతిరేకించాడు. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా ఆస్ట్రేలియా కంటే ఇంగ్లాండే పటిష్టంగా ఉందని గంగూలీ చెప్పాడు.
నొచ్చుకున్న షేన్ వార్న్
అయితే గంగూలీ చెప్పిన సమాధానానికి షేన్ వార్న్ నొచ్చుకున్నాడు. గ్రూప్-ఎ మ్యాచ్లో జూన్ 10వ తేదీన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తప్పక గెలుస్తుందంటూ గంగూలీకి షేన్ వార్న్ నుంచి ఓ సవాల్ ఎదురైంది.
ఒక్క మ్యాచ్ గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా
ఈ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా విజయం సాధిస్తే, గంగూలీ ఆసీస్ జెర్సీ ధరించాలని, అంతేకాదు తనకు డిన్నర్ పార్టీ ఇవ్వాలని కోరాడు. ఒకవేళ అదే మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే తాము ఇంగ్లాండ్ జెర్సీ ధరిస్తామని వార్న్ అన్నాడు. ఈ సవాల్ను గంగూలీ స్వీకరించాడు. ఇప్పుడు ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది.