హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో భారత ఆటగాళ్లతో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు సైతం ఇటీవల అనారోగ్య కారణంగా మరణించిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళి అర్పించారు.
ఫోటోలు: తలపై ప్రేమగా నిమురుతూ కెప్టెన్ కోహ్లీ
ఇందులో భాగంగా శుక్రవారం ప్రారంభమైన చెన్నై టెస్టు మ్యాచ్ ప్రారంభమైన సందర్భంగా ఇరు జట్ల ప్లేయర్లు చేతికి నల్ల బ్యాడ్జ్లను ధరించారు. అంతేకాదు మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు నిమిషాల మౌనం కూడా పాటించారు. ఐదో టెస్టులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు నల్ల బ్యాండ్లను ధరించి మ్యాచ్ ఆడుతున్నారు.
#TeamIndia & @englandcricket pay homage to the passing away of former TN CM J Jayalalithaa Ji #INDvENG pic.twitter.com/iVx4BiMxRG
— BCCI (@BCCI) December 16, 2016
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులర్పిస్తూ, గౌరవ సూచకంగా ఈ విధంగా చేశారు. అయితే జయలలిత మృతికి నివాళులర్పిస్తూ, గౌరవ సూచకంగా ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల మోచేతి బ్యాండ్ ధరించి మ్యాచ్లో పాల్గొంటారని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) గురువారం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఆమె మృతికి సంతాపంగా టెస్టు మ్యాచ్ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమాలు వంటివి నిర్వహించడం లేదని టీఎన్సీఏ అధికారి పీటీఐకి తెలిపారు. చెన్నై టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో టెస్టుకు టీమిండియాలో రెండు కీలక మార్పులు చేశారు.
చెన్నై టెస్టు: కష్టాల్లో ఇంగ్లాండ్, కుక్ మరో రికార్డు
గాయపడ్డ జయంత్ యాదవ్ కు విశ్రాంతి ఇచ్చి, అతని స్థానంలో అమిత్ మిశ్రాను తుది జట్టులోకి తీసుకున్నారు. పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో స్ఫిన్నర్ ఇషాంత్ శర్మను తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే పేసర్ బ్రాడ్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గాయం కారణంగా జేమ్స్ ఆండర్సన్, వోక్స్ తుది జట్టుకు దూరమయ్యారు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది.