గంభీర్ పునరాగమనం
రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న గంభీర్.. ఎట్టకేలకు జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్ తొలి టెస్టులో ఆడిన ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో అతడి స్థానంలో గంభీర్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
కేఎల్ రాహుల్
రాహుల్ సిరీస్లో మిగిలిన రెండు టెస్టులకూ అందుబాటులో ఉండడని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపాడు. గంభీర్ను ఎంపిక చేసేముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతడికి ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు.
ఇషాంత్ స్థానంలో..
డెంగీ జ్వరంతో తొలి టెస్టు దూరమైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలోకి ఆఫ్ స్పిన్నర్ అయిన జయంత్ యాదవ్ను ఎంపిక చేశారు. హర్యానాకు చెందిన జయంత్ ఇప్పటి దాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.
యువరాజ్ సింగ్
ఇటీవలే బాధ్యతలు తీసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ చేపట్టిన తొలి ఎంపిక ఇదే. ఆసక్తికర విషయం ఏమిటంటే గంభీర్తో పాటు మరో సీనియర్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ సైతం ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యాడు. అతనూ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు.