హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా హైదరాబాద్ క్రికెటర్, ముంబైఇండియన్స్ జట్టు కీలక ఆటగాడు అంబటి రాయుడు అరుదైన బహుమతి అందుకున్నాడు. హైదరాబాద్ వేదికగా పూణెతో జరిగిన ఐపీఎల్ పదో సీజన్ పైనల్ మ్యాచ్లో ముంబై విజయం సాధించింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూమ్లో ముంబై ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో ఆ జట్టు ఐకాన్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నాడు.
ఈ క్రమంలో తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుంచి అంబటి రాయుడు అరుదైన బహుమతి అందుకున్నాడు. టెండూల్కర్ సంతకంతో కూడిన ఓ బ్యాట్ని రాయుడి చేతికి అందించాడు. దీంతో రాయుడి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో గాయం కారణంగా పలు మ్యాచ్లకు అంబటి రాయుడు దూరమైన సంగతి తెలిసిందే.
అయితే పదో సీజన్ చివర్లో అంబటి రాయుడు ఆడిన ఐదు మ్యాచ్ల్లో 91పరుగులు సాధించాడు. దీంతో ఐపీఎల్ మొత్తంలో 114 మ్యాచ్లాడిన రాయుడు 2,416 పరుగులు చేశాడు.
From one #MILegend to another.#CricketMeriJaan #IPLfinal #BELI3VE pic.twitter.com/nZY6ZblEjk
— Mumbai Indians (@mipaltan) May 21, 2017