క్రికెట్ అనేది మావాడి రక్తంలో ఉంది
పదేళ్ల నుంచే క్రికెట్ అనేది మావాడి రక్తంలో ఉందని నాయర్ తండ్రి ఎంతో గొప్పగా చెప్పారు. నాయర్ తల్లి మాత్రం అతను ఆడేటప్పుడు చూడాలంటే ఎంతో భయపడి పోతుందట. తాను చూస్తే కొడుకును దురదృష్టం వెంటాడుతుందని, కరుణ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దైవ ప్రార్థన చేస్తూ గడిపేదట.
ఎంతో నచ్చజెప్పా
ఈ కారణంగానే చెన్నై టెస్టుకు ఆమెను తీసుకురావడానికి ఎంతో నచ్చజెప్పాల్సి వచ్చిందని కళాధరన్ తెలిపారు. ఆమె మూఢ నమ్మకం కూడా ఈ దెబ్బతో పటాపంచలైందని తెలిపారు. తనకు స్వర్గంలో ఉన్నంత అనుభూతి కలుగుతోందని కరుణ్ నాయర్ తల్లి అన్నారు.
రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించిన నాయర్
మళయాళీ కుటుంబానికి చెందిన కరుణ్ నాయర్ రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించాడు. తండ్రి కళాధరన్ మెకానికల్ ఇంజినీర్కాగా.. తల్లి ప్రేమ నాయర్ స్కూల్ టీచర్. వృత్తిరీత్యా కళాధరన్ కొన్ని రోజులు రాజస్థాన్లో ఉన్నారు. ఆ తర్వాత బెంగళూరుకు మారారు.
సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్ మన్
టెస్టు క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్ మన్గా నాయర్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం రంజీల్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న నాయర్ చెన్నై టెస్టులో 303 నాటౌట్గా నిలిచాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.
తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత బ్యాట్స్మన్
టెస్టుల్లో సాధించిన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత బ్యాట్స్మన్గా కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్, బాబ్ సింప్సన్ తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన మూడో ప్లేయర్ కరుణ్ నాయర్ కావడం గమనార్హం.
ఎలైట్ గ్రూపులో చేరిన నాయర్
చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించడంతో ఎలైట్ గ్రూపులో చేరాడు. కరుణ్ నాయర్కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నాయర్కు అభినందనలు తెలుపుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. గత 12 ఏళ్లుగా తాను ఒక్కడినే 300 పరుగుల క్లబ్ లో ఉన్నానని, ఇన్నాళ్లకు నాయర్ను ఆహ్వానిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశాడు.
సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించింది నాయరే
2004లో ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్పై సెహ్వాగ్ తొలిసారి ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్మన్గా చరిత్ర సృష్టించాడు. నాలుగేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాపై ఇదే చెన్నై వేదికగా సెహ్వాగ్ రెండోసారి ట్రిపుల్ సెంచరీ సాధించాడు.