ఇషాంత్ శర్మ పెళ్లిలో ధోని, యువరాజ్
ఈ పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ నాయకులతో పాటు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్లు హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితం యువరాజ్ సింగ్, హజల్ కీచ్ ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
ప్రతిమా సింగ్ బాస్కెట్ బాల్ ప్లేయర్
ప్రతిమా సింగ్ బాస్కెట్ బాల్ ప్లేయర్. ప్రతిమా సింగ్ అక్క ఆకాంక్ష బాస్కెట్ బాల్ ప్లేయర్ కావడంతో 2011లో ఢిల్లీలో నిర్వహించిన టోర్నీకి ఇషాంత్ శర్మను ఆహ్వానించింది. చీఫ్ గెస్ట్గా అక్కడికి వెళ్లిన ఇషాంత్ ప్రతిమా సింగ్ను అక్కడే చూశాడు.
తొలిచూపులోనే ప్రేమలో పడ్డ ఇషాంత్ శర్మ
తన ఎత్తుకు మ్యాచ్ అవుతుందనుకున్నాడో ఏమో తెలియదు కానీ తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు. అందరు అబ్బాయిల్లాగే ఇషాంత్ కూడా లవ్లో తొందరపడ్డాడు. ప్రతిమను బయటికెళ్తామా అంటూ ఆహ్వానించాడు.
చాలా రోజులు నడిచిన ఇషాంత్ ప్రేమ కథ
అయితే అక్కకు చెప్పకుండా ఏ పనీ చేయని ప్రతిమా ఈ విషయాన్ని ఆకాంక్షతో చెప్పింది. ఆకాంక్షకు ఇషాంత్ ఎలాంటోడో తెలుసు కాబట్టి చెల్లెలి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మొదలైన వీరి ప్రేమ కథ చాలా రోజులు నడిచింది.
ఇషాంత్కు ప్రతిమా సింగ్ కండీషన్
చివరకు పెళ్లి తర్వాత బాస్కెట్ బాల్ ఆడేందుకు అనుమతివ్వాలన్న ఇషాంత్కు ప్రతిమా సింగ్ కండీషన్ పెట్టింది. ఆటలను ఇష్టపడే ఇషాంత్ ఆమె కోరికకు అడ్డు చెప్పకపోవడంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. బాస్కెట్ బాల్ కోర్టులో ప్రతిమాతో ఇషాంత్కు తొలిపరిచయం ఏర్పడింది.
బాస్కెట్ బాల్ జట్టుకు మాజీ కెప్టెన్ ప్రతిమా సింగ్
వారణాసికి చెందిన ప్రతిమా సింగ్ భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టుకు మాజీ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించింది. అంతేకాదు భారత బాస్కెట్ బాల్ జట్టు తరుపున ఆసియా గేమ్స్తో పాటు పలు జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంది.
ఐదుగురు సిస్టర్స్లో ప్రతిమా సింగ్ చిన్నది
'సింగ్ సిస్టర్స్' అంటే భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టులో తెలియని వారుండరంటే నమ్మండి. ఐదుగురు సిస్టర్స్లో ప్రతిమా సింగ్ చిన్నది. ప్రతిమా సింగ్ సిస్టర్స్ అందరూ మహిళల బాస్కెట్ బాల్ తరుపున పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నారు.
పెళ్లి కారణంగా ముంబై టెస్టుకు దూరం
ఇషాంత్ శర్మ పెళ్లి కారణంగానే ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడలేదు.