ఫ్లోరిడా: ఫ్లోరిడాలో జరిగిన ట్వంటీ 20లో వెస్టిండీస్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంపై కెప్టెన్ ధోనీ స్పందించాడు. చివరి బంతికి షాట్ సెలక్షన్ సరిగా లేకపోవడమే ఓటమికి కారణమని ధోనీ ఆదివారం నాడు అభిప్రాయపడ్డాడు.
షాట్ సెలక్షన్ను సరిగా అమలు చేయకపోవడమే పరాజయానికి కారణమన్నాడు. చివరి రెండు బంతులు అవసరమైన చోట థర్డ్ మ్యాన్ దిశగా ఆడించలన్నా ఆలోచన సరైనదేనని చెప్పాడు. కానీ షాట్ సెలక్షన్ విఫలమైందన్నాడు.
సానుకూల ధోరణితోనే భారత్ బ్యాటింగ్ సాగిందన్నాడు. ఆట అంతా అద్భుతంగా సాగిందని, చివరి బంతికి అంచనాలు తారుమారు కావడంతో ఓడిపోవాల్సి వచ్చిందని తెలిపాడు. కాగా, చివరి బంతికి ధోని ఔట్ కావడంతో విండీస్ను విజయం వరించిన విషయం తెలిసిందే.