న్యూఢిల్లీ: అద్భుతమైన ఫాంను కొనసాగిస్తున్న భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఫైనల్కు చేర్చిన విషయం తెలిసిందే. అంతేగాక అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు.
కాగా, తాజాగా విరాట్ కోహ్లీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఇప్పటి వరకు కోహ్లీ క్రికెట్ తోపాటు అతని ప్రేమ కథ గురించి మనకు తెలుసు. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే.
గత కొంత కాలం క్రితం విడిపోయిన ఈ జంట ఇటీవలి కాలంలో కలిసి కొన్ని కార్యక్రమాలు హాజరవుతుండటంతో ఈ ప్రేమ పక్షులు మళ్లీ కలిశాయని అందరూ అనుకుంటున్నారు.
అయితే, ఇప్పటి వరకు అంతా అనుకున్నట్లు కోహ్లీ తొలి ప్రేమ అనుష్క శర్మ కాదట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన ఫస్ట్ క్రష్ నిన్నటి తరం బాలీవుడ్ కథానాయిక కరిష్మా కపూర్ అని తెలిపాడు.
మొట్ట మొదట తాను ఆమెనే ప్రేమించానని తెలిపాడు కోహ్లి. ఇప్పుడు కోహ్లి లాగే ఒకప్పుడు కరిష్మాకపూర్కి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ అభిమానుల్లో కోహ్లి ఒకడు కావడం విశేషమే మరి. ఇప్పుడు కోహ్లీకి కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినపోయిన విషయం తెలిసిందే.