గుండెపోటుతో సచిన్ తండ్రి ఆకస్మిక మరణం
సచిన్ తండ్రి, ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఈ వార్త విని షాక్కు గురైన సచిన్ వెంటన్ వెంటనే భార్య అంజలితో కలసి ముంబై వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అదే సమయంలో టోర్నీలో టీమిండియా రెండో లీగ్ మ్యాచ్లో భాగంగా జింబాబ్వేతో తలపడింది. సచిన్ లేని ఈ మ్యాచ్లో టీమిండియా మూడు పరుగులతో ఓడింది.
రెండు మ్యాచ్ల్లో టీమిండియా ఓటమి
దీంతో ఆడిన రెండు మ్యాచ్ల్లో టీమిండియా ఓటమి పాలైంది. టీమిండియా సూపర్ సిక్స్లోకి ప్రవేశించాలంటే మిగిలిన మూడు లీగ్ మ్యాచ్లలో గెలిచి తీరాలి. ఇలాంటి సమయంలో జట్టుకు సచిన్ ఎంతో అవసరం. అయితే తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న సచిన్ను వెనక్కురమ్మని పిలవడానికి టీమిండియా మేనేజ్మెంట్కు మనస్కరించలేదు.
సచిన్ని ఒప్పించిన అతడి తల్లి
అంతేకాదు వరల్డ్ కప్లో ఆడాలా వద్దా అన్న విషయాన్ని కూడా సచిన్ నిర్ణయానికి వదిలేసింది. ఇలాంటి సమయంలో సచిన్ తల్లి అతడిని ఒప్పించి ఇంగ్లండ్ వెళ్లి ప్రపంచ కప్లో ఆడాల్సిందిగా చెప్పారు. తల్లి మాటపై గౌరవంతో సచిన్ బాధను గుండెల్లో దాచుకుని ఇంగ్లాండ్కు పయనమయ్యాడు. సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్లో ఆడేందుకు వస్తున్నాడని తెలియగానే అటు అభిమానులతో పాటు క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
101 బంతుల్లో సచిన్ సెంచరీ
టోర్నీలో భాగంగా బ్రిస్టెల్లో కెన్యాతో జరిగిన మూడో మ్యాచ్లో 101 బంతుల్లో సచిన్ టెండూల్కర్ సెంచరీ (140) సాధించాడు. ఈ సెంచరీని సచిన్ తన తండ్రికి అంకితమిచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ దృశ్యం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. క్రికెట్ పట్ల సచిన్కు ఉన్న అంకితభావానికి, నిబద్ధతకు ఈ సంఘటన ఓ నిదర్శనం.