హైదరాబాద్: ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీమిండియాపై టెస్టుల్లో రెండువేలకు పైగా పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో కుక్ చోటు దక్కించుకున్నాడు.
టీమిండియాపై ఇప్పటివరకు ఐదుగురు ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే రెండు వేలు, అంతకు పైగా పరుగులు సాధించాడు. తాజాగా ముంబై టెస్టులో కుక్ రెండువేలకు పైగా పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్గా ఆరో స్ధానంలో నిలిచాడు.
ముంబై టెస్టు: సెంచరీకి చేరువలో జెన్నింగ్స్
2555 పరుగులతో టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మొదటి స్ధానంలో ఉన్నాడు. కాగా, ముంబై టెస్టులో అలెస్టర్ కుక్ 46 పరుగులకే పెవిలియన్కు చేరడంతో
అర్ధ సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
ఇదిలా ఉంటే, ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ముంబైలో నాలుగో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి రోజు లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది.
ముంబై టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు కీటన్ జెన్నింగ్స్ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్కు చక్కటి శుభారంభానిచ్చిన జెన్నింగ్స్ 90 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ సాధించాడు. ముంబై టెస్టుతో ఈ ఏడాది ఆరుగురు ఓపెనింగ్ జంటలను ఇంగ్లాండ్ జట్టు పరీక్షించింది.
1995 తర్వాత ఇలా చేయడం ఇంగ్లాండ్కు ఇదే తొలిసారి. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇంగ్లాండ్పై 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టులో ఇంగ్లాండ్పై విజయం సాధించి టెస్టు సిరిస్ను కైవసం చేసుకోవాలని భారత్ యత్నిస్తోంది.
ఈ టెస్టు సిరిస్లో భాగంగా రాజ్ కోట్లో జరిగిన తొలి టెస్టు డ్రాకాగా, ఆ తర్వాత విశాఖపట్న, మొహాలిలో జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించింది. దీంతో భారత్ 2-0 ఆధిక్యంతో సిరీస్లో ముందంజలో ఉంది. మరోవైపు కోహ్లీసేనను ఎలాగైనా నిలువరించాలనే పట్టుదలతో కుక్ సేన పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.