బెంగళూరు: కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి శిక్షకు గురయ్యాడు. బెంగళూరుతో సోమవారం మ్యాచ్ సందర్భంగా కోల్కతా విజయం ఖరారయ్యే సమయంలో అతను ఆవేశపడ్డాడు.
గంభీర్ ఆవేశం: టీమిండియాకు దూరమిందుకేనా(వీడియో)
చివర్లో సూర్యకుమార్ బౌండరీ బాదగానే తమ డగౌట్లోనే ఉన్న కుర్చీని గట్టిగా తన్నాడు. దీంతో అతడికి మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించాడు.
కాగా, ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఆ జట్టు కెప్టెన్ కోహ్లికి రూ.24 లక్షలు జరిమానా విధించింది.
ఇప్పటికే అతనోసారి ఇదే తప్పిదానికి రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. రెండోసారి ఓవర్లు నెమ్మదిగా వేయడంతో జరిమానా రెట్టింపైంది. ఈ మొత్తాన్ని విరాట్ కోహ్లీ చెల్లించేశాడు.