ఆరేళ్ల తర్వాత యువరాజ్ సెంచరీ:
2011 వరల్డ్ కప్ తర్వాత యువరాజ్ సింగ్ సెంచరీ సాధించాడు. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం యువరాజ్ సెంచరీ సాధించాడు. యువరాజ్కి తన కెరీర్లో ఇది 14వ సెంచరీ. ఆ తర్వాతి 17 ఇన్నింగ్స్ల్లో అతని సగటు 18.32 మాత్రమే.
2011 వరల్డ్ కప్ తర్వాత కటక్లో సెంచరీ చేసిన యువీ
కెరీర్లో పదో సెంచరీ చేసిన ధోని:
కటక్ వన్డేలో ధోని 134 పరుగులతో సెంచరీ సాధించాడు. ధోనికి ఈ సెంచరీ పదో సెంచరీ కావడం విశేషం.
నాలుగో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం:
నాలుగో వికెట్కు యువరాజ్-ధోనిల జోడీ 256 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే చరిత్రలో ఇంగ్లాండ్పై ఇదే నాలుగో వికెట్కు రెండో అత్యుత్తమం. 1998లో జడేజా, అజహరుద్దీన్ జింబాబ్వేపై అజేయంగా 275 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ధోని 200 సిక్సులు:
కటక్ వన్డేలో 200 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్గా ధోని అరుదైన గుర్తింపు పొందాడు. వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటికే కొనసాగుతున్న ధోని తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకున్నాడు. రెండో వన్డేలో ధోని 200 సిక్సర్లు మైలురాయిని అందుకున్నాడు. 48 ఓవర్లో ప్లంకెట్ను ధోని మూడు సిక్సర్లు కొట్టడంతో ఈ ఘనతను సాధించాడు.
200: రెండో వన్డేలో సరికొత్త రికార్డు సృష్టించిన ధోని
ఐదో వన్డే సిరిస్ విజయం
స్వదేశంలో ఇంగ్లాండ్పై భారత్కు ఇది వరుసగా ఐదో వన్డే సిరీస్ విజయం. భారత పర్యటనలో భారత్పై ఇంగ్లాండ్ ఒకే ఒక సిరిస్ 1984-85లో గెలిచింది.