న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

14 ఏళ్ల తర్వాత తొలిసారి: సిడ్నీలో రికార్డుల మోత

మంగళవారం ప్రారంభమైన మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 88 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 365 పరుగులు చేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. మంగళవారం ప్రారంభమైన మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 88 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 365 పరుగులు చేసింది.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా మూడో టెస్టులో కూడా చెలరేగి ఆడుతోంది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రెన్ షా (167 బ్యాటింగ్), డేవిడ్ వార్నర్ (113)లు సెంచరీలతో చెలరేగి ఆడారు.

ఒకే ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సెంచరీలు

ఒకే ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సెంచరీలు

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 2002లో జస్టిన్ లాంగర్-మాథ్యూ హేడెన్‌లు ఇదే మైదానంలో ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

వార్నర్-రెన్ షాలు ఆ ఘనతను సాధించారు

వార్నర్-రెన్ షాలు ఆ ఘనతను సాధించారు

మళ్లీ ఇప్పుడు ఎస్‌సీజీలో వార్నర్-రెన్ షాలు ఆ ఘనతను సాధించారు. మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెన్ షా (167 నాటౌట్), హ్యాండ్ స్కాంబ్(40 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక ఈ టెస్టులో డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సాధించాడు.

87 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేసిన తొలి ఆసీస్ బ్యాట్స్ మెన్

87 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేసిన తొలి ఆసీస్ బ్యాట్స్ మెన్

టెస్టు మ్యాచ్ ఓపెనింగ్ సెషన్‌లో 87 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్‌గా చరిత్ర సృష్టించాడు. లంచ్ విరామానికి ముందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. టెస్టుల్లో వార్నర్‌కి ఇది 18వ టెస్టు సెంచరీ కాగా పాకిస్థాన్‌పై మూడో సెంచరీ కావడం విశేషం.

117 నిమిషాల్లో 17 ఫోర్లతో వార్నర్ సెంచరీ

117 నిమిషాల్లో 17 ఫోర్లతో వార్నర్ సెంచరీ

మూడో టెస్టు లంచ్ విరామానికి ముందే 117 నిమిషాల్లో 17 ఫోర్లతో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరిస్‌లో వార్నర్‌కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. 1930లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డాన్ బ్రాడ్‌మన్ లంచ్ విరామానికి ముందు 105 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X