హైదరాబాద్: హైదరాబాద్ రంజీ జట్టు మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఇబ్రహీం ఖలీల్ అమెరికా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఉగాండాలో వచ్చే నెలలో జరిగే ఐసీసీ డివిజన్-3 వరల్డ్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో అమెరికా తరఫున ఇబ్రహీం ప్రాతినిథ్యం వహించనున్నాడు.
హైదరాబాద్ జట్టు తరఫున 57 మ్యాచ్లు ఆడి 2,158 పరుగులు సాధించిన ఖలీల్ మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు చేశాడు. 2011 నవంబరులో అస్సాంతో జరిగిన రంజీ మ్యాచ్లో ఖలీల్ 14 మందిని అవుట్ చేయడంలో పాలుపంచుకొని ఫస్ట్క్లాస్ క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పా డు.
ఇందులో 11 క్యాచ్లు, మూడు స్టంపింగ్లు ఉన్నాయి. ఐపీఎల్లో ఒక సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న ఖలీల్ లీగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2013 నుంచి అమెరికాలోని షికా గోలో నివసిస్తున్న ఖలీల్కు ఈ నెల 14న అమెరికా పౌరసత్వం లభించింది. ఖలీల్ భార్య అమెరికాలో డాక్టర్గా పనిచేస్తోంది.
ఖలీల్ భార్య అమెరికాలో వృత్తిరీత్యా డాక్టర్. తన భార్యతో కలిసి ఉండటానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలో క్రికెట్కు ఆదరణ తక్కువ. అయితే అమెరికా జట్టులో స్థానం సంపాదించేందుకు నాలుగేళ్లు పట్టిందని ఖలీల్ చెప్పాడు. ఖలీల్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యులు కలిగిన జట్టులో ఎంపిక చేశారు.
Meet the USA team who will compete at @ICC #WCL3 pic.twitter.com/pp8I7yJKLx
— ICC Americas (@iccamericas) 24 April 2017