హైదరాబాద్: భారత్లోని ఉపఖండ పిచ్లపై ఆస్ట్రేలియా స్పిన్నర్లు నాథన్ లియాన్, స్టీవ్ ఒకీఫ్లు అద్భుతంగా రాణిస్తుండడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. బెంగాలీ మీడియం పేసర్ షిబ్ శంకర్ పాల్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గంగూలీ పైవ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా బ్యాటింగ్ లైనప్ను తీవ్ర ఒత్తడిలోకి నెట్టిన నాథన్ లైయన్, ఒకీఫ్ వంటి ఆసీస్ స్పిన్నర్లను ఇంతకు ముందెప్పుడూ తాను చూడలేదని అన్నాడు. 'ఆసీస్కు చెందిన ఇద్దరు స్పిన్నర్లు రెండు వైపుల నుంచి ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి వ్యూహాన్ని గతంలో టీమిండియా అమలు చేసేది. కానీ, బ్యాట్స్మెన్ను ఇంత ఒత్తిడిలోకి నెట్టేస్తున్న ఇలాంటి ఆసీస్ స్పిన్నర్లు నేనెప్పుడూ చూడలేదు' అని అన్నారు.
పూణె టెస్టులో రెండు ఇన్నింగ్స్లు కలిపి స్టీవ్ ఓకీఫ్ 12 వికెట్లు తీసుకోవడంతో తొలి టెస్టులో భారత్పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ప్రస్తుతం బెంగుళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నాథన్ లియాన్ ఒక్కడే 50 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.
దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 189 పరుగులకే అలౌటైంది. దీనిపై గంగూలీ స్పందిస్తూ ఈ ఇద్దరు స్పిన్నర్లు భారత పిచ్లపై అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని కొనియాడాడు. ఇదిలా ఉంటే తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్ రెండో టెస్టులో కూడా మరింత ఒత్తిడికి గురవుతుంది.