ఆధారాలు లేకుండా నిందలు ఎలా వేస్తారు
అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ జట్టుపై నిందలు వేయడమేంటని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్బంగా టెస్ట్ కెప్టెన్ ఫా డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడని అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
జట్టును కాపాడుకోవం నా విధి
'దాదాపు దక్షిణాఫ్రికా జట్టు ట్యాంపరింగ్ పాల్పడిందనే నిందను వేయడానికి యత్నించారు. ఇక్కడ నా జట్టును కాపాడుకోవడమనేది నా విధి. ఎటువంటి పొరపాటు చేయకపోయినా మమ్ముల్ని ఇరికించే యత్నమైతే జరిగిందనేది నాకు అనిపించింది. దాంతో అంపైర్లతో తీవ్రంగా వాగ్వాదం చేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో బంతి సరిగా లేనప్పుడు దానికున్న లెదర్ ఊడిపోతుంది' అని ఏబీ చెప్పాడు.
అంపైర్లు నా వాదనతో ఏకీభవించలేదు
'ఆ విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాను. అయితే అంపైర్లు నా వాదనతో ఏకీభవించలేదు. మరొకవైపు మేము ట్యాంపరింగ్కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కాకపోతే ఇక్కడ మేము అమాయకులం అనేది చివరకు తేలింది. మేము ట్యాంపరింగ్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు' అని ఏబీ పేర్కొన్నాడు.
ఎల్ఈడీ బోర్డులకు తగిలి బంతి పాడై ఉండొచ్చు
ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరగలేదని నిర్ధారించుకున్న అంపైర్లు బంతిని మార్చలేదు. మరోవైపు ఎల్ఈడీ బోర్డులకు తగిలి బంతి పాడై ఉండొచ్చని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ రెండు పరుగుల తేడాతో గెలిచి వన్డే సిరీ ను గెలుచుకుంది.